సీక్వెల్ ఆలోచన ఉంది

Monday,August 26,2019 - 03:39 by Z_CLU

అల్లరి నరేష్ -భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సుడిగాడు’ సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కోసం కామెడీసినిమాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి లేటెస్ట్ గా మాట్లాడాడు దర్శకుడు భీమినేని.

భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ” ‘సుడిగాడు’ సక్సెస్ తర్వాత దానికి పార్ట్ చేయాలని నరేష్ నేను ఇద్దరం అనుకున్నాం. కానీ ఆ సమయంలో కుదరలేదు. సిల్లీ ఫెలోస్ చేసే ముందు కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు చాలా కామెడీ షోలు వచ్చేసాయి. ‘సుడిగాడు’ టైంలో అలాంటి ఎంటర్టైన్ మెంట్ లేదు. సో అందుకే అంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అలాంటి సినిమా చేయాలంటే ఓ ఆరు నెలలు టైం తీసుకోవాలి. ఈ లోపు మనం రాసుకున్నవి మిగతా షోలో వచ్చేసే పరిస్థితి. అందుకనే మళ్ళీ వద్దని అనుకున్నాం. కానీ లేటెస్ట్ కొబ్బరి మట్ట సక్సెస్ అయ్యాక స్పూఫు కామెడీని ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని అర్థమైంది. కథ కుదిరి నిర్మాత దొరికితే నేను నరేష్ సుడిగాడు సీక్వెల్ చేయడానికి సిద్దమే” అన్నారు.