అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్

Sunday,January 06,2019 - 11:02 by Z_CLU

ఇటివలే అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ -త్రివిక్రమ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.. ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై లేటెస్ట్ గా చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియరా అద్వాని బన్నీ సరసన హీరోయిన్ గా నటించనుందట… లేటెస్ట్ గా కొందరు హీరోయిన్స్ తో డిస్కర్షన్ జరిపిన మేకర్స్ ఫైనల్ గా కియరాని సెలెక్ట్ చేసుకున్నారని, త్వరలోనే హీరోయిన్ గా కియరా పేరు ప్రకటించబోతున్నారని సమాచారం.

స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ , హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్ , రాదా కృష్ణ నిర్మిస్తున్నారు.