Allu Arjun Pushpa - 2 భాగాలుగా వస్తోందా?
Thursday,May 06,2021 - 04:42 by Z_CLU
తెలుగులో రెండు భాగాలుగా వచ్చిన సినిమాలు చాలా అరుదు. అలా రెండు భాగాలుగా తెరకెక్కిన ‘బాహుబలి’ అందరికీ గుర్తుండిపోయి పెద్ద విజయం అందుకుంది. ఇప్పుడు అదే కోవలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుందని ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది.
ఈ ప్రచారంలో కొంత నిజముంది. ముందు నుండే ఈ కథను రెండు భాగాలుగా తీయలనుకున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్ టైంలోనే ఈ ఆలోచనను బన్నీ ముందు పెట్టాడు సుకుమార్. వెంటనే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు భాగాలుగా కథను రెడీ చేశారు. షూటింగ్ దశలోనే ఈ విషయం బయటికొచ్చింది. తాజాగా ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ వచ్చింది.
అయితే మొదటి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో 2 నెలల్లో సినిమా రావాల్సి ఉంది. కానీ కరోన ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడటం దాని వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం పార్ట్ 1 కి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేశారు సుక్కు అండ్ టీం. లాక్ డౌన్ తీసేసిన వెంటనే చకచకా శరవేగంగా షెడ్యుల్స్ ఫినిష్ చేశారు. ఇంకో 2-3 షెడ్యుల్స్ లో సినిమా టోటల్ గా పూర్తి కానుందని సమాచారం.
అక్టోబర్ లేదా నవంబర్ లో పుష్ప మొదటి భాగాన్ని విడుదల చేసి రెండో భాగాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ఫ్రాంచైజీ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics