వైఎస్ఆర్ 'యాత్ర' మొదలైంది

Wednesday,June 20,2018 - 12:30 by Z_CLU

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన హిస్టారికల్ పాదయాత్ర నేపథ్యంలో ఓ సినిమా రాబోతోంది. మహి వి రాఘవ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది.

పోలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. ఇక మరో కీలక పాత్రకు సుహాసిని సెలక్ట్ అయింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనుంది. సబితా ఇంద్రారెడ్డికి చెందిన చేవెళ్ల నియోజకవర్గం నుంచే పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ఆర్.

సినిమాలో వైఎస్ఆర్ కొడుకు జగన్ పాత్ర కోసం సూర్యను తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేదు. 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్ ను నిర్మిస్తున్నారు.