పాతాళ భైరవి లాంటి సినిమా చేయాలి: చిరంజీవి

Saturday,May 12,2018 - 03:05 by Z_CLU

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి సూపర్ హిట్ అయింది. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా కమర్షియల్ గానే కాకుండా, క్రిటిక్స్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడీ లిస్ట్ లోకి చిరంజీవి కూడా చేరిపోయాడు. మహానటి యూనిట్ ను మెచ్చుకున్న చిరు, డైరక్టర్ నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందించాడు.

నాగ్ అశ్విన్, అశ్వినీ దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ లను తన ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించారు చిరంజీవి. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తో సినిమా చేయాలని ఉందన్నారు చిరంజీవి. కుదిరితే పాతాళ భైరవి లాంటి కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించాలని ఉందన్నారు మెగాస్టార్.

అటు నాగ్ అశ్విన్ కూడా వెంటనే ఓకే చెప్పాడు. ఆల్రెడీ తన దగ్గర ఓ లైన్ ఉందని, చిరంజీవి ఓకే అంటే వెంటనే డెవలప్ చేస్తానని ప్రకటించాడు. ఈ కాంబినేషన్ కేవలం ప్రకటనకే పరిమితం అవుతుందా.. లేక కార్యరూపం దాలుస్తుందా అనేది చూడాలి.