గ్రాండ్ గా జరిగిన "ఉన్నది ఒకటే జిందగీ" ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Thursday,October 26,2017 - 11:36 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీ విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. పార్క్ హయత్ లో జరిగిన ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు సినిమా యూనిట్ లో కీలక సభ్యులంతా హాజరయ్యారు. హీరో రామ్ తో పాటు ముద్దుగుమ్మలు లావణ్య త్రిపాఠి, అనుపమ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కార్యక్రమానికి వచ్చిన సభ్యులంతా సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఉన్నది ఒకటే జిందగీ హైలెట్స్ ను మీడియాతో పంచుకున్నాడు రామ్. కేవలం కథను నమ్మి చేసిన ఈ ఎమోషనల్ మూవీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందన్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమలకు ఇది రెండో సినిమా కాదా.. దేవిశ్రీప్రసాద్-రామ్ కాంబోలో ఇది ఐదో సినిమా కావడం విశేషం.

ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఏపీ, నైజాంలో మంచి అంచనాలున్నాయి.