‘ఏ మంత్రం వేశావే’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది

Tuesday,February 27,2018 - 07:34 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘ఏ మంత్రం వేశావే’ మూవీ మార్చి 9 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ లోపు ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన సినిమా యూనిట్, ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది. ‘ఏ వేళ చూశానో కానీ..’ అంటూ సాగే ఈ మెలోడీ నంబర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

సినిమాలో హీరో లవ్ లో పడే సిచ్యువేషన్ లో ఉండబోయే ఈ సాంగ్ సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది.  అరుణ్ వేమూరి లిరిక్స్ రాసిన ఈ పాటని యాజిన్ నిజార్ పాడాడు. అబ్దుస్ సమద్ ఈ సినిమాకి  మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తరవాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో ఇంట్రెస్టింగ్ ‘గేమ్’ చుట్టూ తిరిగే స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమా, యూత్ కి తప్పకుండా నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.  శ్రీధర్ మర్రి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శివానీ సింగ్ హీరోయిన్ గా నటించింది.