వెండితెరపైకి మరో బయోపిక్

Wednesday,May 08,2019 - 03:20 by Z_CLU

విద్యాబాలన్ కు బయోపిక్స్ కొత్త కాదు. గతంలో డర్టీపిక్చర్ చేసింది. రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ ఈమె చెంతకు చేరింది. హ్యూమన్ కంప్యూటర్ గా పేరుతెచ్చుకున్న శకుంతలాదేవి పాత్రలో కనిపించబోతోంది విద్యాబాలన్.

ఇండియాలో హ్యూమన్ కంప్యూటర్ గా పేరుతెచ్చుకున్నారు శకుంతల దేవి. మ్యాథ్స్ లో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించారు. ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు డైరక్టర్ అను మీనన్. ఈ బయోపిక్ లో విద్యాబాలన్ లీడ్ రోల్ పోషించబోతోంది.

విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా. వచ్చే ఏడాది సమ్మర్ లో శకుంతల దేవి చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.