ఈసారి నా గురి తప్పదు

Wednesday,May 08,2019 - 01:35 by Z_CLU

ఈసారి తన గురి తప్పదంటున్నారు నిర్మాత దిల్ రాజు. మహర్షి సినిమా మహేష్ కు మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని, తనకు కూడా కెరీర్ బెస్ట్ గా నిలిచిపోతుందంటున్నారు. ప్రేక్షకులు ఎన్ని అంచనాలతో వచ్చినప్పటికీ, అంతకుమించి ఉంటుందంటున్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కంటే ముందే నేను సినిమా చూశాను. రీసెంట్ గా 3 రోజుల కిందట కూడా సినిమా చూశాను. కొన్ని సినిమాలు ఎట్టిపరిస్థితుల్లో గురి తప్పవు. అందుకే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అలా మాట్లాడాను. ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వచ్చినా అంతకుమించి మహర్షి ఉంటుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.”

ఇలా మహర్షి సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందంటున్నారు దిల్ రాజు. తను 10 సినిమాలు బాగుంటాయని చెబితే, అందులోంచి ఒకటి మిస్ అవ్వొచ్చు కానీ 9 మిస్ అవ్వలేదని, మహర్షి సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని దిల్ రాజు చెబుతున్నారు. వరల్డ్ వైడ్ 2వేల థియేటర్లకు పైగా మహర్షి రిలీజ్ అవుతోందని, స్క్రీన్స్ పరంగా చూసుకుంటే ఇది నాన్-బాహుబలి రికార్డు అంటున్నారు.

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది మహర్షి. తెలంగాణలో ఈ సినిమాను రోజుకు 5 షోలు వేసుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అటు మొదటి వారం రోజులు టిక్కెట్టు ధరలు పెంచుకోవచ్చంటూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. సో.. ఈసారి మహర్షి కళ్లుచెదిరే వసూళ్లు సాధించేలా ఉంది.

తెలంగాణలో రేపు ఉదయం 8 గంటల నుంచి, ఏపీలో ఉదయం 5 గంటల నుంచి మహర్షి షోలు ప్రారంభం కాబోతున్నాయి.