త్వరలోనే సెట్స్ పైకి వెంకీ -తేజ సినిమా

Sunday,February 18,2018 - 02:30 by Z_CLU

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న విక్టరీ వెంకటేష్ తేజ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారం నుంచి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే ఈ షెడ్యుల్ కి సంబంధించి లోకేషన్స్ కూడా ఫైనల్ చేసారు యూనిట్. వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ కీ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఇటివలే ఈ సినిమాకు సంబంధించి కొత్తవారితో ఆడిషన్ నిర్వహించిన తేజ కొన్ని పాత్రలకు అప్ కమింగ్ నటీ నటులను ఫైనల్ చేసాడని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ , ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా లక్ష్మి భూపాల మాటలు అందిస్తున్నాడు. అనుప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.