'మహానటి' వస్తుందా ?

Sunday,February 18,2018 - 05:06 by Z_CLU

నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న సినిమా ‘మహానటి’. స్వప్న సినిమాస్ బ్యానర్ పై సావిత్రి బయో పిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిందే. ఇటివలే ఈ సినిమాను మార్చ్ 29 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ డేట్ కి రిలీజ్ కాదని మరో డేట్ కి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ కి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ అవసరమని, ఆ గ్రాఫిక్ వర్క్ కి ఇంకాస్త టైం పడుతుందని అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ , శాలిని పాండే ముఖ్య పాత్రల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్వప్న దత్ నిర్మాత. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.