హ్యాట్రిక్ సినిమా ఎవరితో ?

Tuesday,February 25,2020 - 12:40 by Z_CLU

‘ఛలో’ తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి తన సత్తా చూపించాడు. ఆ సినిమాతో నాగ శౌర్య కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు వెంకీ.  రెండేళ్ళ తర్వాత ‘భీష్మ’ తీసి నితిన్ కి కెరీర్ బెస్ట్ హిట్ అందించాడు. దీంతో ఇప్పుడీ డైరెక్టర్ మీద స్టార్ హీరోల కన్ను పడింది. అవును వెంకీ త్వరలోనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. ‘ఛలో’ సక్సెస్ తర్వాత యూ.వీ.క్రియేషన్స్ నుండి అడ్వాన్స్ అందుకున్నాడు వెంకీ. ఇప్పుడా బ్యానర్ లో ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది.

వెంకీ కి మైత్రి మూవీ మేకర్స్ నుండి కూడా అడ్వాన్స్ అందింది. ఈ బ్యానర్ లో కూడా సినిమా చేయాల్సి ఉంది. మైత్రి నిర్మాతలు విజయ్ దేవరకొండ -వెంకీ కాంబినేషన్ లో సినిమా తీయాలని చూస్తున్నారు. ఈ రెండు కాకుండా యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత మిక్కిలినేని సుధాకర్ కి కూడా వెంకీ సినిమా చేయాల్సి ఉంది. ఈ బ్యానర్ లో సినిమా ఏ హీరోతో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రస్తుతం ‘భీష్మ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న వెంకీ కుడుముల తన హ్యాట్రిక్ సినిమాను ఏ హీరోతో చేస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి వెంకీ నుండి కెరీర్ బెస్ట్ హిట్ అందుకునే ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.