ఆ బ్యానర్ లో సాహో డైరెక్టర్ సినిమా ?

Sunday,December 30,2018 - 10:10 by Z_CLU

ప్రస్తుతం ప్రభాస్ తో ‘సాహో’ సినిమాను తెరకెక్కిస్తున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ నెక్స్ట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ లో చేయబోతున్నాడని సమాచారం. ఇటివలే సుజీత్ కి మైత్రి నుండి అడ్వాన్స్ అందిందని, సాహో పూర్తికాగానే ఈ బ్యానర్ లోనే సినిమా ఉంటుందని తెలుస్తుంది. సుజీత్ డైరెక్ట్ చేసే ఈ సినిమా ఓ స్టార్ హీరోతోనే ఉండబోతుందని టాక్.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సాహో వచ్చే ఏడాది ఆగస్ట్ 15 విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మైత్రి లో చేసే సినిమాకు సంబంధించి వర్క్ స్టార్ట్ చేయనున్నాడట సుజీత్.