రిపీట్ కానున్న స్టైలిష్ కాంబో

Friday,March 10,2017 - 11:16 by Z_CLU

2016 లో ఎండ్ లో రిలీజ్ అయి మోస్ట్ స్టైలిష్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్న ధృవ కి పెద్ద ఎసెట్ చెర్రీ, అరవింద్ స్వామీ కాంబినేషన్. ‘తని ఒరువన్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అరవింద్ స్వామి మోస్ట్ క్రూషియాల్ రోల్ ప్లే చేశాడు. ధృవ సినిమాకి 100  మార్కులు దక్కితే, అందులో సగం మార్కులు ఈ కాంబోకే దక్కుతాయి. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన చెర్రీ, అరవింద్ స్వామి మణిరత్నం సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో అరవింద్ స్వామి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. మణిరత్నం సినిమాలతోనే అరవింద్ స్వామి లైమ్ లైట్లోకి వచ్చాడు.

 గతంలో అరవింద్ స్వామి హీరోగా బొంబాయి, రోజా సినిమాలతో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాడు మణిరత్నం. ఆ తరవాత కడలి సినిమాలోను మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాడు అరవింద్. అయితే చెర్రీ సినిమాలో అరవింద్ స్వామిది ఏ తరహా క్యారెక్టర్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.