రంగస్థలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్: ముఖ్య అతిథులు వీళ్లే!

Monday,March 12,2018 - 11:19 by Z_CLU

ఈనెల 18న విశాఖలో గ్రాండ్ గా జరగనుంది రంగస్థలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్. ఈ వేడుకకు సంబంధించి స్టేజ్ ఏర్పాటు పనులు నిన్ననే ప్రారంభమయ్యాయి. దేవిశ్రీప్రసాద్ లైవ్ షో టోటల్ ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. కేవలం ఆటపాట మాత్రమే కాకుండా.. స్టార్స్ హంగామాతో కలర్ ఫుల్ గా జరగనుంది ప్రీ-రిలీజ్ ఈవెంట్

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ప్రీ-రిలీజ్ పంక్షన్ కు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. మెగాస్టార్ తో పాటు దర్శకధీరుడు రాజమౌళి, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కూడా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా హాజరవుతారట.

చరణ్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 3 పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది రంగస్థలం. సుకుమార్ తో పాటు రామ్ చరణ్ కెరీర్ లో ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ ఇదే.