‘జాను’ గుర్తుండిపోయే సినిమా - శర్వా

Monday,February 10,2020 - 04:37 by Z_CLU

శర్వానంద్‌, సమంత అక్కినేని జంటగా తెరకెక్కిన ‘జాను’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత అక్కినేని మాట్లాడుతూ – ” సినిమాను చూసిన వారంద‌రూ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. మంచి ఎక్స్‌పీరియెన్స్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను” అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ – “ఎన్నో హిట్ సినిమాలు చేశాను. కానీ నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ‘జాను’. ‘గీతాంజ‌లి’, ‘ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు’ వంటి గొప్ప సినిమాల‌తో మా సినిమాను, గొప్ప న‌టుల‌తో మ‌మ్మ‌ల్ని రాఘ‌వేంద్ర‌రావుగారు పోల్చ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. చాలా రోజులుగా న‌టుడిగా ఏదో మిస్ అయ్యామ‌నే భావ‌న మ‌న‌సులో ఉండిపోయింది. అది ’జాను’తో తీరింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. న‌న్ను మంచి యాక్ట‌ర్ అని ఇప్పుడు పిలుస్తున్నారంటే ముందు మా డైరెక్ట‌ర్‌కే క్రెడిట్ ఇవ్వాలి. న‌న్ను రామ‌చంద్ర‌గా అద్భుతంగా మ‌లిచారు. అలాగే స‌మంత‌కు కూడా స‌గం క్రెడిట్ ఇస్తాను. నేను, స‌మంత తొలిరోజు నుండి జాను, రామ‌చంద్ర‌గా బెస్ట్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాం. ఆ స్కిప్ట్ మ‌మ్న‌ల్ని అలా చేయించింది. మా అమ్మ‌గారు, ఆవిడ స్నేహితుల‌తో క‌లిసి ఈ సినిమాను చూసి ఇంటికొచ్చి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంత బాగా వీళ్లు సినిమాకు క‌నెక్ట్ అయ్యారా? అని ఆనంద‌మేసింది. క్లాసిక్‌, మంచి సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు.. మీరే ఎంక‌రేజ్ చేయాలి’’ అన్నారు