రాజమౌళి మల్టీస్టారర్ లో స్టార్ రైటర్

Friday,September 21,2018 - 06:30 by Z_CLU

చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తాజాగా ఈ మెగా వెంచర్ లోకి ఓ స్టార్ రైటర్ ఎంటరయ్యాడు. క్రేజీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు. గతంలో మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలకు వర్క్ చేశాడు బుర్రా.

సైరా, ఎన్టీఆర్ బయోపిక్ వంటి సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు సాయిమాధవ్ బుర్రా. అయినప్పటికీ, రాజమౌళి ఆఫర్ ను ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఇది యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి.

పైగా బాహుబలి లాంటి సినిమాకు పనిచేయాల్సిన అవకాశాన్ని గతంలో మిస్ చేసుకున్నాడు సాయిమాధవ్ బుర్రా. అందుకే ఈసారి రాజమౌళి ప్రాజెక్టు మిస్ చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే కథకు తుది మెరుగులు దిద్ది మాటల పనిని సాయి మాధవ్ బుర్రాకు అప్పగించనున్నాడు రాజమౌళి. డి.వి.వి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీయబోతున్నాడు.