మీడియా ముందుకొచ్చిన సాహో డైరక్టర్

Saturday,August 03,2019 - 01:53 by Z_CLU

దాదాపు ఐదేళ్లుగా సాహో సినిమాతో ట్రావెల్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. రన్ రాజా రన్ తర్వాత పూర్తిగా ఈ సినిమాకే టైమ్ మొత్తం కేటాయించాడు. కానీ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ఇన్నాళ్లకు మీడియా ముందుకొచ్చిన సుజీత్.. సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు.

“బాహుబలి సక్సెస్ అవ్వకముందే సాహో కథ రాసుకున్నాను. బాహుబలి-2 పెద్ద సక్సెస్ అయిందని నా సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ ఎలిమెంట్స్ ను ఇంకాస్త డెవలప్ చేశాను. అంతేతప్ప, కథ-స్క్రీన్ ప్లేలో ఎలాంటి మార్పుల్లేవు.”

 

సినిమాలో కేవలం 4 పాటలు మాత్రమే ఉంటాయంటున్నాడు సుజీత్. అందులో 3 పాటలు కథను ముందుకు నడిపించేలా ఉంటాయని, ఒక పాటను మాత్రం కాస్త డ్యూయట్ టైపులో డ్రీమ్ సాంగ్ గా తీశామని చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ లేట్ అయిందనే విషయాన్ని ఒప్పుకోలేదు.

“బాహుబలి-2 టైమ్ లో టీజర్ రిలీజ్ చేయడం వల్ల అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేశాం అనుకున్నారు.  కానీ అప్పుడు షూట్ చేయలేదు. ఆ ఏడాది నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. ప్రీ-ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ కేటాయించాం. దీనివల్ల బడ్జెట్ ను కంట్రోల్ లో పెట్టగలిగాం.”

సినిమా పాటల్లో ఓ సాంగ్ ను మాత్రం శంకర్ స్టయిల్ లో గ్రాండియర్ గా తీశానని చెప్పుకొచ్చిన సుజీత్.. తనను రాజమౌళి, శంకర్ తో మాత్రం పోల్చొద్దని మీడియాను రిక్వెస్ట్ చేశాడు.