ఈసారి కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆర్జీవీ

Tuesday,March 26,2019 - 12:57 by Z_CLU

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయాడు ఆర్జీవీ. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే, వర్మకు పుష్కలంగా పబ్లిసిటీ మాత్రం వచ్చేసింది. అందుకే ఇప్పుడీ దర్శకుడు మరో క్రేజీ బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు. అవును.. త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానంటున్నాడు వర్మ.

నిజానికి కేసీఆర్ బయోపిక్ ఇప్పటికే ఒకటి తెరపైకి వచ్చింది. చిన్న నటులు, పరిచయం లేని దర్శకుడు కేసీఆర్ బయోపిక్ ను తీశారు. కానీ వర్మ మాత్రం కేసీఆర్ అసలైన జీవితాన్ని చూపిస్తానంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే రీసెర్చ్ వర్క్ స్టార్ట్ అయిందని, త్వరలోనే దాని డీటెయిల్స్ బయటపెడతానంటున్నాడు. ఈ దర్శకుడు ఇప్పటికే వైఎస్ఆర్ బయోపిక్ ను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను 29న వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు క్లీన్-U సర్టిఫికేట్ ఇచ్చారు.