కేసీఆర్ బయోపిక్ ప్రకటించిన వర్మ

Thursday,April 18,2019 - 03:30 by Z_CLU

మొన్నటికి మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మరో బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీసుకురాబోతున్నాడు. ఈ విషయాన్ని వర్మ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.

కేసీఆర్ పై తీయబోయే చిత్రానికి టైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. ఆ పదానికి మధ్యలో కేసీఆర్ అనే అక్షరాల్ని పొందుపరిచాడు. ది అగ్రెసివ్ గాంధీ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. కేవలం ట్యాగ్ లైన్ తో ఆగకుండా తన మార్క్ డైలాగ్ కూడా రిలీజ్ చేశాడు వర్మ. ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రు అనే డైలాగ్ ను కూడా విడుదల చేశారు.

సరిగ్గా ఇదే ఫార్ములాను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కూడా ఉపయోగించాడు వర్మ. వాడు, నా పిల్లలు కలిసి నన్ను వెన్నుపోటు పొడిచారు అనే డైలాగ్ ను వాడాడు. ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ కోసం ఈ డైలాగ్ ను వైరల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కేసీఆర్ పాత్ర కోసం వర్మ ఏ నటుడ్ని సెలక్ట్ చేస్తాడో చూడాలి.