మరో రీఎంట్రీకి రెడీ అవుతున్న బుట్ట బొమ్మ
Saturday,March 07,2020 - 11:26 by Z_CLU
కథానాయిక పూజా హెగ్డే ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్ కొట్టేస్తున్న ఈ బ్యూటీ.. దాదాపు 8ఏళ్ల తర్వాత తమిళ్లో రీఎంట్రీ ఇవ్వబోతోంది.
2012లో వచ్చిన తమిళ చిత్రం ‘ముగమూడి’తో వెండితెరపైకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత తమిళ్లో మరే సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నేళ్లకు తమిళ స్టార్ హీరో విజయ్తో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ ఛాన్స్ అందుకుంది.
విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ‘మాస్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ఆయన ‘గురు’ ఫేం సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసమే విజయ్కు జోడీగా పూజాను తీసుకున్నారని టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వస్తుంది.