అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూత

Wednesday,January 24,2018 - 11:22 by Z_CLU

అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూశారు. బెంగళూరులో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1933 మార్చి 6న పశ్చిమ బెంగాల్ లో జన్మించిన కృష్ణకుమారి.. 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటితరం స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకున్నారు.

పల్లెపడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించారు. ఇలా దాదాపు 110 చిత్రాల్లో నటించారు కృష్ణకుమారి. ప్రముఖ నటి షావుకారు జానకి, కృష్ణకుమారి అక్కాచెల్లెళ్లు.

3 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు కృష్ణకుమారి. రాష్ట్రస్థాయిలోనూ నంది అవార్డులు దక్కించున్నారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ సంస్థ నుంచి లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు కూడా పొందారు.