'కార్తికేయ 2' కి హీరోయిన్ ఫిక్స్ ?

Sunday,December 22,2019 - 09:02 by Z_CLU

ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. చందూ మొండేటి డైరెక్షన్ లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారనే టాక్ వినబడుతుంది. హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కావడంతో అనుపమను ఫైనల్ చేసుకున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పీపుల్ మీడియా బ్యానర్ పై టి.జీ.విశ్వ ప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు.