వెయ్యి వినాయక మట్టి విగ్రహాలు పంచిన నారా రోహిత్ ఫ్యాన్స్

Friday,August 25,2017 - 02:03 by Z_CLU

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం.. అని హీరో నారా రోహిత్ ఇచ్చిన పిలుపు మేరకు అల్ ఇండియా నారా రోహిత్ ఫాన్స్ విజయవాడలోని పలు ప్రాంతాలలో 1000 మట్టి విగ్రహాలను పంచడం జరిగింది.

హీరో నారా రోహిత్ ఫాన్స్ సినిమాలకే పరిమితం కాకుండా ఇలాంటి సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రాంలు చేయడం చాలా బాగుందంటూ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వస్తున్నాయి.

ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న కథలో రాజకుమారి సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. సెన్సార్ కూడా పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.