డెబ్యూ డైరెక్టర్ తో నాగచైతన్య

Thursday,January 31,2019 - 07:25 by Z_CLU

ప్రస్తుతం ‘మజిలీ తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత మ్యాగ్జిమం ‘వెంకీమామ’ సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ లోపు డెబ్యూ డైరెక్టర్ శశి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగచైతన్య. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నాడు.

ఈ సినిమా ఎగ్జాక్ట్ గా సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనే డీటేల్స్ అయితే కన్ఫమ్ కాలేదు కానీ, స్క్రిప్ట్ వినీ వినగానే చైతు, ఈ సినిమాకి ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని లాక్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, ఈ సినిమాకి సంబంధించిన డీటేల్స్ ని త్వరలో అనౌన్స్ చేస్తారు.

నాగ చైతన్య తన డెబ్యూ మూవీ ‘జోష్ తరవాత మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయలేదు. మళ్ళీ పదేళ్ళ తరవాత సెట్స్ పైకి వస్తున్న ఈ కాంబోపై, ఆడియెన్స్ లో క్యూరియాసిటీ కనిపిస్తుంది.