పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ

Wednesday,November 14,2018 - 10:02 by Z_CLU

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ నందమూరి వారసుడు ఎట్రాక్టివ్ ఫిజిక్ కోసం ట్రైనింగ్ కూడా బిగిన్ చేసేశాడు. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడీ టాక్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

గతంలో ‘చిరుత’ సినిమాతో రామ్ చరణ్ ని గ్రాండ్ గా సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ చేసిన పూరి, ఆ తరవాత ‘రోగ్’ సినిమాతో ఇషాన్ ని, రీసెంట్ గా ‘మెహబూబా’ సినిమాతో పూరి ఆకాష్ ని కూడా లాంచ్ చేశాడు. అందుకే హయ్యెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య డెబ్యూ కి రెడీ అవుతున్న మోక్షజ్ఞ సినిమాకి పూరి జగన్నాథ్ అయితే బెటర్ అని బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు కానీ, నందమూరి ఫ్యాన్స్ లో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడెప్పుడొస్తుందా అనే క్యూరియాసిటీ  కనిపిస్తుంది.