JGM యాక్షన్ ఎపిసోడ్ తో పూజా హెగ్డే ఎంట్రీ
Thursday,June 02,2022 - 01:51 by Z_CLU
Actress Pooja Hegde joins JGM shoot soon
విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘JGM’ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా వచ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ముందుగా యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నాడు పూరి. విజయ్ సరసన పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. మొదటి షెడ్యుల్ లో పూజ కూడా పాల్గొననుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పూజ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటుందని సమాచారం.
ముంబైలో ఇరవై రోజుల పాటు షెడ్యుల్ జరగనుందని తెలుస్తుంది. సినిమాలో వార్ ఎపిసోడ్స్ ఎక్స్ట్రార్డినరీ గా డిజైన్ చేశారని తెలుస్తుంది. పూరి గత కొన్నేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. కొందరు హీరోలను అనుకున్నాడు కానీ ఫైనల్ గా ప్రాజెక్ట్ విజయ్ చేతిలో పడింది.
ప్రస్తుతం పూరి – విజయ్ కాంబోలో తెరకెక్కనున్న ‘లైగర్’ షూటింగ్ పూర్తయింది. ఆగస్టులో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే మళ్ళీ పూరి -విజయ్ ‘JGM’ కోసం మరోసారి కలుస్తున్నారు. వంశీ పైడిపల్లి , చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics