Mahesh Trivikram Movie to Launch on February 3rd
సూపర్ స్టార్ మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కనున్న SSMB28 సినిమాకు సంబంధించి అప్ డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 3న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో సినిమా ఓపెనింగ్ అనుకుంటున్నారు. అయితే ఈ ఈవెంట్ కి ఎప్పటిలానే మహేష్ హాజరు కావడం లేదు. తన కుటుంబ సభ్యులు మాత్రమే ఎటెండ్ అవ్వనున్నారు.
తాజాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసిన త్రివిక్రమ్ ఇటివలే మహేష్ కి ఫైనల్ నెరేషన్ ఇచ్చేశాడని సమాచారం. మార్చ్ లేదా ఏప్రిల్ నుండి మొదటి షెడ్యుల్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. కాస్టింగ్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తుంది.మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే సెకండ్ ఫీమేల్ లీడ్ ఎవరనేది చెప్పనున్నారు.
మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలొచ్చాయి. అతడు ఓవర్సీస్ లో మహేష్ కి కొత్త మార్కెట్ ఓపెన్ చేయగా ఖలేజా మాత్రం మూవీ లవర్స్ ని డిజప్పాయింట్ చేసి యావరేజ్ అనిపించుకుంది. మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ కాంబోలో రాబోతున్న మూడో సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.