#Mahesh29 - కోలీవుడ్ డైరెక్టర్ తో మహేష్?

Friday,June 11,2021 - 01:12 by Z_CLU

ప్రెజెంట్ పరశురాం బుజ్జి డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో #Mahesh28 చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఆ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమా గురించి ఓ ప్రచారం ఊపందుకుంది.కోలీవుడ్ డైరెక్టర్ తో మహేష్ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది.

గతం మురుగదాస్ తో స్పైడర్ సినిమా చేశాడు మహేష్. ఇప్పుడు మరో కోలీవుడ్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు లోకేష్ కనగారాజ్. కార్తి ఖైదీ సినిమాతో ఉన్నపళంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు లోకేష్. తాజాగా ఆటను దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్ళు రాబట్టింది. అందుకే మహేష్ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

director lokesh kanagaraj

దర్శకుడు లోకేష్ కనగరాజ్

ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ నవీన్ , రవి లు నిర్మిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే బేనర్ లో సర్కారు వారి పాట చేస్తున్నాడు మహేష్. మరో సారి ఈ బేనర్ లో లోకేష్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. మాస్టర్ సినిమా సెట్స్ పై ఉండగానే లోకేష్ కి తెలుగులో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ అందించారట మైత్రి నిర్మాతలు. ఇక తాజాగా ఆ డైరెక్టర్ కి మహేష్ ని ఎటాచ్ చేసి ఈ కాంబోలో సినిమాను నిర్మించాలని చూస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే #Mahesh28 టైటిల్ తో ఈ సినిమా ఎనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics