Mahesh Babu ఏడాదిలో మూడు విషాదాలు

Tuesday,November 15,2022 - 12:06 by Z_CLU

Mahesh Babu is lost his family members in single year

సహజంగా ఒక విషాదం జరిగినప్పుడు ఆ కుటుంబం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఏడాదిలో మూడు విషాదాలు అంటే తట్టుకోవడం చాలా కష్టం. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇంట్లో అదే జరిగింది.  ఒకే ఏడాది లో మహేష్ కుటుంబంలో ఎవరూ ఊహించని విధంగా మూడు విషాదాలు జరిగాయి. ఇదే ఏడాది జనవరి 8న  కృష్ణ పెద్ద కుమారుడు ,మహేష్ అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు. రమేష్ బాబు మరణం తర్వాత మహేష్ ఇంట కొన్ని నెలలకే మరో విషాదం నెలకొంది. కృష్ణ భార్య , మహేష్ తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28 న అనారోగ్యంతో కన్నుమూశారు. తల్లి మరణం నుండి మహేష్ ఇంకా కోలుకోక ముందే ఇప్పుడు  కృష్ణ గారి మరణంతో ఘట్టమనేని కుటుంబానికి మరో విషాదం ముంచుకొచ్చింది.

సూపర్ స్టార్ కృష్ణ (Krishna Ghattamaneni) మరణం ఘట్టమనేని కుటుంబానికి, ముఖ్యంగా మహేష్ కి తీరని లోటు అనే చెప్పాలి. తండ్రి కృష్ణ అంటే మహేష్ బాబు కి ప్రాణం. చైల్డ్ ఆర్టిస్ట్ గా తనతో పాటే సినిమాల్లోకి తీసుకొచ్చి మహేష్ ని పూర్తి స్థాయి నటుడిగా మార్చడంలో కృష్ణ కీలక పాత్ర పోషించారు. అందుకే  తండ్రి ని మహేష్ ఒక తండ్రిలా కాకుండా గురువులా భావిస్తాడు. ఆయన మీద మహేష్ కి ఉన్న గౌరవం మాటల్లో చెప్పలేనిది. గ్యాప్ దొరికినప్పుడల్లా తండ్రి ఇంటికెళ్ళి ఆయనతో సమయం కేటాయిస్తుంటాడు మహేష్.  తండ్రి మరణం నుండి కోలుకోవడానికి మహేష్ కి చాలా టైం పడుతుంది.

అన్నయ్య , అమ్మ , నాన్న ఈ ముగ్గురు మహేష్ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఈ ముగ్గురంటే మహేష్ కి చాలా ఇష్టం. మరి ఆ ముగ్గురు మహేష్ కి ఇలా నెలల గ్యాప్ లో దూరమవ్వడం ఎంతో బాధించే విషయం. మహేష్ కి ఈ సమయంలో భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని అభిమానులు , సినిమా ప్రముఖులు కోరుకుంటున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics