సొంతగా డబ్బింగ్ చెప్పిన కీర్తిసురేష్

Monday,November 27,2017 - 11:38 by Z_CLU

తెలుగులో చేసిన మూడో సినిమాకే డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది కోలీవుడ్ భామ కీర్తిసురేష్. పవన్ కల్యాణ్ సరసన ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమాలో తన పాత్రకు కీర్తిసురేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ విషయాన్ని కీర్తిసురేష్ స్వయంగా వెల్లడించింది. పవన్ సినిమాకు డబ్బింగ్ పూర్తిచేసినట్టు ఓ పిక్ కూడా పోస్ట్ చేసింది.

తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తిసురేష్. అది పెద్ద హిట్ అయింది. తర్వాత నాని సరసన నేను లోకల్ సినిమా చేసింది. అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ రెండు సినిమాల విజయాలతో ఏకంగా పవన్ సరసన నటించే అవకాశం కొట్టేసింది కీర్తిసురేష్. ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ లో ఉంది. మూవీకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల్ని వారణాసిలో తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది అజ్ఞాతవాసి.