ItluMaredumilliPrajanikam థియేటర్స్ లో ట్రైలర్

Thursday,November 10,2022 - 11:12 by Z_CLU

అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam)  నవంబర్ 25 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ , టీజర్ , సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. రేపు థియేట్రికల్ ట్రైలర్ ని థియేటర్స్ లో లాంచ్ చేస్తున్నారు. సమంత ‘యశోద’ , హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ పాంథర్ (Wakanda forevar)’ సినిమాలతో పాటు రేపటి నుండి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ థియేటర్స్ ప్లే అవ్వనుంది.

నవంబర్ 12న డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నారు. సోషల్ మీడియాలో రిలీజ్ కంటే ముందే  ప్రేక్షకులకు థియేటర్స్ లో ట్రైలర్ ను చూపించబోతున్నారు మేకర్స్. ట్రైబల్ ఏరియాకి ఎలక్షన్ ఆఫీసర్ గా వెళ్ళే కేరెక్టర్ లో అల్లరి నరేష్ నటిస్తున్న  ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా కనిపించనుంది. వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాత‌. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌.