Monday,August 07,2023 - 11:30 by Z_CLU
స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘ ‘శతమానం భవతి’ అనే టైటిల్ మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. నేను డీజే షూటింగ్ చేస్తున్నప్పుడు దిల్ రాజు చిన్న పిల్లాడిలా పరిగెత్తుకొచ్చి మనం నేషనల్ అవార్డు కొట్టాం అని అన్నారు. చాలా సంతోపడ్డాం. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లి మన అందరినీ గర్వపడేలా చేసిన సినిమా శతమానం భవతి. సతీశ్గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను డైరెక్టర్ కాక ముందు నుంచి ఆయన సక్సెస్ఫుల్ రైటర్. అప్పటి నుంచే మా జర్నీ స్టార్ట్ అయ్యింది. గబ్బర్ సింగ్ నుంచి డీజే, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలకు పని చేసిన సతీశ్ ఇవాళ శతమానం భవతి అనే బ్యానర్ను పెట్టటం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఈ బ్యానర్కు నా సపోర్ట్, కో ఆర్టినేషన్ ఎప్పుడూ ఉంటుంది. తన సినిమా టైటిల్తో బ్యానర్ను పెట్టుకున్న వ్యక్తిని ఆశీర్వదించటానికి వచ్చిన దిల్ రాజుగారికి ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా యూనానిమస్గా గెలిచిన దిల్ రాజుగారికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. కథాకేళి సినిమా టీజర్ చూస్తుంటే సినిమా మంచి పేరు, లాభాలను తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు చింతా గోపాల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా టీమ్ను ఆశీర్వదించటానికి వచ్చిన దిల్ రాజుగారు, హరీశ్ శంకర్గారికి థాంక్స్. ఈ సినిమాలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన సతీశ్ గారికి థాంక్స్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు అవుతుంది. ప్రియా ఓ ప్రియా చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్పై చూసుకున్నాను. ఆరోజు నుంచి ఈరోజు వరకు రైటర్, డైరెక్టర్గా నిలబడ్డాను. ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎందుకు పెట్టావని చాలా మంది అడిగారు. ఇదే ప్రశ్నను నేను ఈవీవీ సత్యనారాయణ గారిని వేశాను. ‘హాయ్’ సినమా నుంచి ఈవీవీగారి చివరి సినిమా వరకు ఆయన దగ్గరే పని చేశాను. ఆయన తన అనుభవాలను చెప్పేవారు. ఓసారి ఈవీవీ సినిమా అనే బ్యానర్ ఎందుకు పెట్టారని నేను అడిగినప్పుడు మనకు సినిమా తప్ప మరేం రాదు. మనం సినిమాలు మాత్రమే తీయగలం. మనం ఫ్లాప్స్లో ఉన్నప్పుడు మనతో నిర్మాతలు సినిమాలు చేయరు. ఒకవేళ నిర్మాతలు ఓకే అన్నా కూడా ఆర్టిస్టులు ముందుకు రారు. కష్టమైనా, నష్టమైనా మనమే చేయాలని అన్నారు. ఆయన చెప్పిన మాటలతోనే ఇప్పుడు బ్యానర్ పెట్టాను. కోవిడ్ వల్ల నేను స్టార్ట్ చేసిన కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు లేట్ అవుతున్నాయి. ఈ గ్యాప్లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని చేసిన సినిమానే ఈ కథాకేళి. నా పాతికేళ్ల ప్రయాణానికి కారణమైన నా తల్లిదండ్రులకు, నన్ను రైటర్గా పరిచయం చేసిన ముప్పలనేని శివగారికి, నన్ను డైరెక్టర్ని చేసిన ఈవీవీ సత్యనారాయణగారికి, అల్లరి నరేష్గారికి, దిల్ రాజు, హరీష్ శంకర్గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కెరీర్లో నాకు తోడుగా నిలిచిన నా భార్య రమకి, నా కొడుకు యశ్విన్, కూతురు శిరీష్, తమ్ముడు ప్రదీప్కి ఎప్పటకీ రుణ పడి ఉంటాను. ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ ఇప్పటి వరకు చాలా కథలు చెప్పి ఉంటారు. సాధారణంగా దెయ్యం కథలను అందరూ చెప్పి ఉంటారు. కానీ దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే.. అనేదే మా కథా కేళి సినిమా. దిల్ రాజుగారు చెప్పినట్లు డిఫరెంట్గా ప్రయత్నం చేసినప్పటికీ నా స్టైల్లో ఫ్యామిలీస్ అందరూ చూసి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే కథ ఉంది. ఇప్పటి యూత్కు నచ్చే కథ, అందరినీ నవ్వించే హారర్కామెడీ ఉంది. ఈ సినిమాలో పని చేసిన నా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి, మా చింతా గోపాల కృష్ణారెడ్డిగారికి థాంక్స్. డెఫనెట్గా సినిమా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.కె.బాలచంద్రన్ మాట్లాడుతూ ‘‘ ఈ సినిమాలో నేను పని చేయటానికి ప్రధాన కారణమైన నరేంద్ర వర్మగారికి థాంక్స్. డైరెక్టర్ సతీశ్ వేగేశ్నగారిని కెప్టెన్ కూల్ అని పిలుస్తాను. చాలా నెమ్మదిగా తనకేం కావాలో ఆ ఔట్పుట్ను రాబట్టుకుంటారు. త్వరలోనే కథాకేళి మీ అందరికీ ముందుకు వస్తుంది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ దాము నర్రావుల మాట్లాడుతూ ‘‘అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్నగారికి థాంక్స్’’ అన్నారు.