Saturday,August 27,2016 - 11:00 by Z_CLU
‘దృశ్యం’ దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఘటన’. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్హిట్ అయిన ’22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని సన్మూన్ క్రియేషన్స్ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. ‘ఘటన’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవలే సీనియర్ నరేష్ ఈ చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీ ప్రియ మాట్లాడుతూ “అప్పట్లో ‘ప్రతిఘటన’ చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో డెఫినెట్గా ఈ ‘ఘటన’ కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ‘ఘటన’ కొత్త ట్రెండ్ని సృష్టిస్తుంది. ఆగస్ట్ 31న ప్లాటినవమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించి సెప్టెంబర్లో సినిమా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం ” అన్నారు.
నిత్యామీనన్, క్రిష్ జె. సత్తార్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మనోజ్ పిళ్ళై, ఎడిటింగ్: బవన్ శ్రీకుమార్, సంగీతం: అరవింద్ శంకర్, ఆర్ట్: ప్రేమ్నవాస్, పాటలు: అనంత శ్రీరామ్, కాస్ట్యూమ్ డిజైనర్: అను పార్థసారథి,
సమర్పణ: బేబి సంస్కృతి ఎం, బేబీ అక్షర ఎం,
నిర్మాత: వి.ఆర్. కృష్ణ ఎం,
స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ