ఎక్స్ క్లూజీవ్ : సుధీర్ వర్మతో రవితేజ సినిమా !

Sunday,September 08,2019 - 11:58 by Z_CLU

‘రణరంగం’ కథను రవితేజ కోసమే రాసానని ఇటివలే చెప్పుకున్నాడు సుధీర్ వర్మ. అయితే శర్వాకి కథ నచ్చడంతో రవితేజకి చెప్పి ఆ కథను శర్వాతో చేసానని తెలిపాడు. ఇక ఎప్పటి నుండో రవితేజతో సినిమా చేయాలని చూస్తున్న సుధీర్ వర్మ ఇప్పుడు ఎట్టకేలకు మాస్ మహారాజాతో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే రవితేజ కి కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని, ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించనున్నాడని సమాచారం. అంటే ఫస్ట్ టైం సుధీర్ వర్మ తన కథతో కాకుండా ఓ రైటర్ అందించిన కథతో సినిమా చేయనున్నాడన్నమాట.

ప్రస్తుతానికి ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెండు డిఫరెన్స్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

‘డిస్కో రాజా’ తర్వాత నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తర్వాతే సుధీర్ వర్మ సినిమాను స్టార్ట్ చేస్తాడు రవి తేజ.