జీ ఎక్స్ క్లూజివ్: అప్పుడే డైరెక్షన్ చేయను

Monday,December 23,2019 - 12:31 by Z_CLU

ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ -రైటర్స్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. అలాంటి బాండింగ్ దర్శకుడు త్రినాధరావు నక్కిన -రచయిత ప్రసన్న మధ్య ఉంది. ‘సినిమా చూపిస్తా మావ’ నుండి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. వరుసగా సూపర్ హిట్స్ తో మంచి కాంబో అనిపించుకొని ముందుకు వెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ విడిపోయారని , ప్రసన్న దర్శకుడిగా మరబోతున్నడంటూ రూమర్ వచ్చింది.

లేటెస్ట్ గా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ప్రసన్న… “త్రినాధరావు గారు నేను విడిపోయామని ఇకపై కలిసి సినిమా చేయమని వస్తున్న వార్తలో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం మేమిద్దరం కలిసి నెక్స్ట్ సినిమాకి వర్క్ చేస్తున్నాం. దిల్ రాజు గారి బ్యానర్ లో ఒక సినిమా ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థలో ఒక సినిమా, పీపుల్ మీడియా సంస్థలో మరో సినిమా కమిట్ అయ్యాం. ఈ మూడు సినిమాలు పూర్తి చేసాకే డైరెక్షన్ గురించి ఆలోచిస్తాను.

భవిష్యత్తులో డైరక్షన్ చేస్తానంటున్న ప్రసన్న, ప్రస్తుతానికైతే తనకు అలాంటి ప్లాన్స్ లేవని స్పష్టంచేశాడు. ఇండస్ట్రీలో చాలామంది తను డైరక్షన్ వైపు వెళ్లానని అనుకుంటున్నారని, అలాంటిదేం లేదని అంటున్నాడు. రైటింగ్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టానని క్లారిటీ ఇచ్చాడు.

“ఈమధ్య ఎన్టీఆర్ గారితో ఓ యాడ్ ఫిలింకి వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కూడా “నువ్వు డైరెక్షన్ చేస్తున్నావ్ అంట కదా” అని అడగ్గానే షాక్ అయ్యాను. అసలు నా ప్రమేయం లేకుండానే నా డైరెక్షన్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయిందో తెలియడం లేదు”

ప్రసన్న లేటెస్ట్ స్టేట్ మెంట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. త్రినాధరావు నక్కిన, ప్రసన్న కాంబోలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.