104 కోసం బాలయ్య ఫిక్స్ ...

Sunday,December 24,2017 - 06:06 by Z_CLU

కె.ఎస్.రవి కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జై సింహ సినిమా షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేశాడు… ఇప్పటికే తేజ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేయబోతున్న బాలయ్య మరో వైపు తన 104 సినిమాపై కూడా దృష్టి పెట్టేసాడట. తేజ సినిమా తర్వాత బాలయ్య పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా బాలయ్య తో ‘పైసా వసూల్’ సినిమాను తెరకెక్కించిన పూరి అదే సమయంలోనే బాలయ్య కి మరో స్క్రిప్ట్ వినిపించాడట.. లేటెస్ట్ గా పూరి తో మరో సినిమా చేస్తానని బాలయ్య కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తేజతో చేసే సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించి తక్కువ టైంలో షూటింగ్ ఫినిష్ చేయాలనీ భావిస్తున్న బాలయ్య ఆ సినిమా తర్వాత పూరితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది శ్రీరామ నవమి కి ప్రారంభం అయ్యే  ఛాన్స్ ఉందని తెలుస్తుంది.