నలుగురు హీరోలతో శమంతకమణి

Sunday,February 12,2017 - 03:17 by Z_CLU

మల్టీస్టారర్లు అన్నీ ఒకేలా ఉండవు. కేవలం ఇద్దరు హీరోలుంటేనే మల్టీస్టారర్ అనుకునే రోజులివి. కానీ ఇప్పుడు నలుగురు హీరోలు కలిశారు. ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా పేరు శమంతకమణి. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు. భలే మంచిరోజు సినిమాతో ఈ కుర్ర దర్శకుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ ఈరోజు జరిగింది. దర్శకుడు శ్రీనువైైట్ల ఈ సినిమాకు క్లాప్ కొట్టారు.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ చిత్రం మార్చి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఇందులో హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల ఎవరనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇలా ఒకేసారి నలుగురు హీరోలతో సినిమా స్టార్ట్ అవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.