అనసూయ "కథనం" రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,July 24,2019 - 12:25 by Z_CLU

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, పతాకాలపై న‌రేంద్ర‌ రెడ్డి, శ‌ర్మ‌ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాను ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతున్నారు.

అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పృధ్వీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. దర్శకుడు రాజేష్ కు ఇదే మొదటి సినిమా.

క్ష‌ణం, రంగ‌స్థ‌లం తర్వాత అనసూయ చేస్తున్న ఈ క‌థ‌నంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఆమె హ్యాట్రిక్ కొడుకుందని అంతా ఎదురుచూస్తున్నారు.