'22' టీజర్ రివ్యూ

Sunday,February 02,2020 - 11:31 by Z_CLU

కొన్ని టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచడమే కాక ఆడియన్స్ లో  క్యూరియాసిటీ కలిగిస్తాయి. లేటెస్ట్ గా ’22’ సినిమా టీజర్ అలాంటి ఆసక్తినే కలిగిస్తూ ఆదరణ పొందుతుంది.

రోడ్డు మీద కారు చేజింగ్ షాట్ తో మొదలైన ఈ టీజర్ తర్వాత మర్డర్ మిస్టరీ తో ఆసక్తి కలిగిస్తుంది. మర్డర్ మిస్టరీ అనేది ఎప్పుడు ఆడియన్ కు కొత్తగానే ఉంటుంది. కానీ దర్శకుడు శివ దానికి ఏటీయం అనే ఎలిమెంట్ తో ను యాడ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ కలిగించాడు. టీజర్ లో “ఈ ఏటీయం దగ్గరికి ఎవరెవరు వచ్చి భాద పడుతున్నారో వాళ్ళకే ఇలా జరుగుతుందన్న మాట” అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ఈ విషయాన్ని రివీల్ చేసాడు దర్శకుడు. కాకపోతే అసలు ఏటీయం లోకి వెళ్లి భాదలు చెప్పుకోవడం, ఆ తర్వాత జరిగే సంఘటనలు అనేవి ప్రేక్షకులకు థ్రిల్ చేసేలా అనిపిస్తున్నాయి. ఇక 1 : 27 సెకన్ల ఈ టీజర్ లో విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎట్రాక్ట్ చేసాయి.

రూపేష్ , సలోని జంటగా నటిస్తున్న ఈ సినిమాతో వినాయక్, పూరి జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసిన శివ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.