కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ అందిస్తున్న తాజా సంచలన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు: టి. నరేష్కుమార్, టి. శ్రీధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ