Prabhas plans to announce another pan India movie
Tuesday,December 22,2020 - 12:44 by Z_CLU
బాహుబలి-2 తర్వాత తన ప్రతి సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ఆయన చేస్తున్న మూవీస్ అన్నీ పాన్-ఇండియన్ సినిమాలే. ఇప్పుడీ హీరో మరో బడా మూవీని ఎనౌన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ సినిమా చేసి పెట్టాలి ప్రభాస్. కానీ సరైన కథ, దర్శకుడు సెట్ అవ్వడం లేదు. మైత్రీ నిర్మాతలు లోకల్ డైరక్టర్స్ ను రిఫర్ చేస్తున్నారట. దీంతో ఎవరైనా బాలీవుడ్ డైరక్టర్ ను చూడమని ప్రభాస్ సూచించాడట.
ప్రస్తుతం ఓ బాలీవుడ్ డైరక్టర్ ను వెదికిపట్టే పనిలో మైత్రీ మూవీ మేకర్స్ బిజీగా ఉన్నారు. డైరక్టర్ తో పాటు కథ కూడా సెట్ అయితే.. త్వరలోనే ప్రభాస్ నుంచి మరో పాన్-ఇండియా మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాధేశ్యామ్ (Radheshyam), ఆదిపురుష్ (AdiPurush), సలార్ (Salaar) సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ మూవీ ఉంది. వీటిలో రాధేశ్యామ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే సలార్ మొదలవుతుంది.