NTR’s Rakhi Completes 14 Years Today

Tuesday,December 22,2020 - 02:32 by Z_CLU

కలర్ ఫుల్ సినిమాల డైరెక్టర్ కృష్ణవంశీ, NTR కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాఖీ. ఈ సినిమా సరిగ్గా 14 క్రితం డిసెంబర్ 22 న రిలీజయింది. NTR కరియర్ లోనే డిఫెరెంట్ జోనర్ లో తెరకెక్కిన రాఖీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

వరకట్న వేధింపులకు, అమ్మాయిలపై బహిరంగంగా జరిగే ఆసిడ్ దాడులకు వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తిరుగుబాటు చేసే యువకుడిగా NTR యాక్టింగ్ క్రిటిక్స్ చేత కూడా భేష్ అనిపించుకుంది.

మెసేజ్ ఓరియంటెడ్ సినిమానే అయినా కృష్ణవంశీ ఏ మాత్రం కమర్షియల్ వ్యాల్యూస్ తగ్గకుండా సినిమాని సరిగ్గా ప్లాన్ చేసుకున్నాడు.

సుహాసిని మణిరత్నం ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమాలో NTR సరసన ఇలియానా, ఛార్మి నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికీ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే రాఖీ సినిమానే చెబుతారు.

ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి కృష్ణవంశీ గుర్తుచేసుకునే సందర్భం ఒకటి ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ కోసం, ఎన్టీఆర్ సెట్ లోకి రాగానే పెద్ద డైలాగ్ నెరేషన్ ఇచ్చారు కృష్ణవంశీ. 10 నిమిషాలు టైమ్ అడిగిన ఎన్టీఆర్, ఎక్స్ ప్రెషన్స్ తో పాటు మొత్తం డైలాగ్ ను గుక్కతిప్పుకోకుండా చెప్పేశారు. పక్కనే ఉన్న సుహాసిని ఆశ్చర్యపోయి ఆనందంతో కన్నీళ్లుపెట్టుకున్నారు. ఎన్టీఆర్ టాలెంట్ కు ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అంటూ ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటారు కృష్ణవంశీ.