సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. SSMB28 అంటూ ఎనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మహేష్ 'సర్కారు వారి పాట' షూట్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఆ సినిమాను కంప్లీట్ చేసి త్రివిక్రమ్ సినిమాకు డేట్స్ ఇస్తాడు. అంటే డిసెంబర్ లేదా జనవరి నుండి మహేష్ తో త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది.
ఈ లోపు కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. తాజాగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేసారని సమాచారం. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే ని ఫిక్స్ చేసుకొని ఎనౌన్స్ కూడా చేసేశారు. ఇక సెకండ్ లీడ్ మాత్రమే ఉంది. ఆ క్యారెక్టర్ కి చాలా మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్ గా లావణ్య తో ఆ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్.
ఈ మధ్య త్రివిక్రమ్ ప్రతీ సినిమాలో సెకండ్ హీరోయిన్ కనిపిస్తుంది. తనకి ఇదో సెంటిమెంట్ అనుకోవచ్చు. 'అత్తారింటికి దారేది' సినిమాలో ప్రణీత , 'సన్ ఆఫ్ సత్య మూర్తి' సినిమాలో నిత్యా మీనన్ , 'అ ఆ' లో అనుపమ , 'అరవింద సమేత' లో ఈషా రెబ్బ , తాజాగా 'అల వైకుంఠ పురములో' నివేత పెతురాజ్ ఇలా త్రివిక్రమ్ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ పక్కా ఉండాల్సిందే. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. మరి లావణ్య ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయితే కనుక ఆమెకి ఇది బిగ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎలాగో త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి కూడా మంచి స్పేస్ ఉంటుంది పైగా మహేష్ బాబు సినిమా కాబట్టి లావణ్య కి ఈ సినిమా ప్లస్ అవ్వడం ఖాయం.
- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics