అరవింద్ స్వామి ప్రముఖ తమిళ కథానాయకుడు.. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు. 1991 లో మణిరత్నం ‘దళపతి’ తో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ (1992), ‘బొంబాయి’ (1995) సినిమాల్లో కథానాయకుడిగా మంచి పేరు సంపాదించాడు.