మిస్టర్ సెన్సార్ క్లియరయింది

Friday,April 07,2017 - 06:30 by Z_CLU

వరుణ్ తేజ్ ‘మిస్టర్’ సెన్సార్ క్లియరయింది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ముందుగానే అనౌన్స్ చేసినట్టు ఈ రోజు సంధ్య కన్వెన్షన్, గచ్చిబౌలి లో అంతే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చీఫ్ గెస్ట్ అనేసరికి ఈ ఈవెంట్ కి మరింత వెయిట్ పెరిగిపోయింది.

 

లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్  ఇప్పటికే మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దానికి తోడు ఇప్పటికే రిలీజైన ట్రేలర్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.