సుధీర్బాబు కొత్త సినిమా 'సమ్మోహనం' లోగో లాంచ్
Friday,February 23,2018 - 10:01 by Z_CLU
సుధీర్బాబు హీరోగా మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సమ్మోహనం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగో డిజైన్ ను విడుదల చేశారు.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “డిసెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్లో తొలి షెడ్యూల్ చేశాం. హీరో ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. జనవరి 1 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం “ అని అన్నారు.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ “రొమాన్స్, హాస్యం సమ్మిళితమైన కథ ఇది. ఈ సినిమాలో హీరో చిల్డ్రన్ బుక్స్ ఇల్లస్ట్రేటర్గా నటిస్తున్నారు. అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే ఒక కొత్త తరం ప్రేమకథా చిత్రమిది. పి.జి.విందా ఫొటోగ్రఫీ హైలైట్ అవుతుంది“ అని చెప్పారు.