రెండో షెడ్యూల్‌లో 'శ్రీసత్యసాయి ఆర్ట్స్‌' తాజా చిత్రం 

Thursday,August 18,2016 - 10:40 by Z_CLU

‘అధినేత’, ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్‌టైగర్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ ‘ఓ చినదాన’, ‘ఒట్టేసిచెబుతున్నా’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’, ‘యముడికి మొగుడు’, ‘బెట్టింగ్‌ బంగార్రాజు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ ఆగస్ట్‌ 12తో పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ – ”హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్ట్‌ 12 వరకు జరిగిన మొదటి షెడ్యూల్‌తో 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఆగస్ట్‌ 16న రెండో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. మా బేనర్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘బెంగాల్‌ టైగర్‌’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. డైరెక్టర్‌ సత్తిబాబు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది” అన్నారు.
నవీన్‌ చంద్ర, శృతి సోది జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప థ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని క ష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చమ్మక్‌ చంద్ర, పిళ్ళా ప్రసాద్‌, విద్యుల్లేఖా రామన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., ఎడిటింగ్‌: గౌతంరాజు, కథ: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజ్‌, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.