ఇటు కరోనా.. అటు కొత్త సినిమా షూటింగ్

Monday,August 10,2020 - 12:37 by Z_CLU

దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. మరీ ముఖ్యంగా ముంబయిలో పరిస్థితి దారుణంగా ఉంది. సినిమా షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయినప్పటికీ తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు రణబీర్ కపూర్.

Ranbir Kapoor హీరోగా నటిస్తున్న “శంషేరా” (Shamshera) సినిమా షూటింగ్ ముంబయిలో మొదలైంది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్టుడియోలో ఈ సినిమా షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు దర్శకుడు కరణ్ మల్హోత్రా ప్రకటించాడు.

నిజానికి ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ జనవరిలోనే పూర్తయింది. జులై 31న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇక ఫైనల్ షెడ్యూల్ లో భాగంగా ప్యాచ్ వర్క్ పూర్తిచేద్దామనుకునే టైమ్ కు కరోనా ప్రారంభం కావడంతో షూటింగ్ ఆపేశారు.

అలా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ను కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య మళ్లీ ప్రారంభించారు. వాణికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో Sanjay Dutt కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.