రాజశేఖర్ కెరీర్ లోనే ఖరీదైన సినిమా

Saturday,June 10,2017 - 11:20 by Z_CLU

`పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం` చిత్రంలో డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా, ఆయ‌న భార్య‌గా పూజా కుమార్ న‌టిస్తున్నారు. `చంద‌మామ క‌థ‌లు`, `గుంటూరు టాకీస్‌` ఫేమ్‌ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. ఈ చిత్రాన్ని ప‌లు అరుదైన లొకేష‌న్ల‌లో రూపొందిస్తున్నారు. అందులో కీల‌క‌మైన‌ది జార్జియా. అక్క‌డ 33 రోజులు చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.

భార‌తీయ చిత్రాల్లో ఇప్ప‌టివర‌కు వెండితెర‌పై క‌నిపించ‌ని లొకేష‌న్ల‌లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌డానికి ద‌ర్శ‌కుడు నిర్ణ‌యించారు. ఆ మేర‌కు యురాషియ‌న్ కంట్రీస్‌లో దాదాపు 40 రోజులు చిత్రీక‌రించారు. స్క్రిప్ట్ డిమాండ్‌ని బ‌ట్టి వాతావ‌ర‌ణాన్ని ప‌ట్టించుకోకుండా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అక్క‌డికి వెళ్లి ప‌నిచేశారు. రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ “మేం ప‌నిచేసిన లొకేష‌న్ల‌కు 100 కిలోమీట‌ర్ల ప‌రిధిలో హోట‌ళ్లు కూడా లేవు. అయినా టీమ్ మొత్తం క్యాంపుల్లోనే ఉన్నాం“ అని అన్నారు. ఆయ‌న కెరీర్‌లోనే అత్యంత భారీ వ్య‌యం రూ.25కోట్ల‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిదే. అందులోనూ జార్జియా షెడ్యూల్ అత్యంత ఖ‌రీదైన‌ది.

డా.రాజ‌శేఖ‌ర్‌, అదితి, పూజా కుమార్‌, శ్ర‌ద్ధా దాస్‌, కిషోర్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్, సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌ సంగీతం అందిస్తున్నారు.